ఉప్పల్ ప్రెస్ క్లబ్ శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

Published: Wednesday September 22, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ఉప్పల్ ప్రెస్ క్లబ్ శాశ్వత భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవన నిర్మాణానికి సిడిపి నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుపుడూ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు ఉప్పల్ సర్కిల్ డీసీని కలిసి పక్కా భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్రాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు వేముల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మాదిరాజ్ సురేష్ కుమార్, ఏవి శ్రీధర్ రావు, కార్యదర్శులు శివాజీ, అశోక్, కోశాధికారి యాదగిరి, ముఖ్య సలహాదారులు చంద్రమౌళి, డి.సురేష్, పల్లా మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వడ్డేపల్లి  కిషోర్ తదితరులు పాల్గొన్నారు.