చెక్కులు పంపిణీ చేసిన చైర్మన్ ప్రదీప్ రెడ్డి..
Published: Tuesday March 08, 2022
తల్లాడ, మార్చి 7 (ప్రజాపాలన న్యూస్): మండల పరిధిలోని కుర్నవల్లి సొసైటీలో ఇటీవల మరణించిన సభ్యులకు లక్ష రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ చెక్కులను సొసైటీ చైర్మన్ ఆయిలూరి ప్రదీప్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. కుర్నవల్లికి చెందిన ఆయిలూరి అంజిరెడ్డి, బొగ్గుల సీతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సొసైటీలో వారికి లోన్ తో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండటంతో ఒక్కొక్కరికి 50 వేలు మంజూరయ్యాయని తెలిపారు. రుణాలు పొందిన సభ్యులకు గ్రూపు ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందన్నారు.
Share this on your social network: