సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మిరియాల ఆదినారాయణ మృతి

Published: Monday May 17, 2021

బెల్లంపల్లి, మే 16, ప్రజాపాలన ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల ఆదినారాయణ మృతి చెందడం సిపిఐ పార్టీకి కళారంగానికి తీరనిలోటని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. ఆదివారం నాడు ఆదినారాయణ మృతదేహాన్ని బెల్లంపల్లి లోని తన గృహంలో సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రచయితగా డైరెక్టర్ గా అనేక నృత్య నాటికలకు దర్శకత్వం వహించి కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను అభివృద్ధి చేయడంలో గత నలభై సంవత్సరాలుగా ప్రజానాట్యమండలికి కృషిచేసి పట్టువదలని విక్రమార్కునిగా పనిచేసిన కామ్రేడ్ మిరియాల ఆదినారాయణ అకాల మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు, ఇతని మరణవార్త తెలిసిన వెంటనే కమ్యూనిస్టు పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి విప్లవ జోహార్లు అర్పించడం జరిగిందిని తెలిపారు, ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి, చిప్ప నర్సయ్య, బి.పూర్ణిమ, జి.సి.మాణిక్యం, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, పట్టణ సహాయ కార్యదర్శి బొంతు లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి మండల కార్యదర్శి బి కే ఎన్ యు నాయకులు అక్క పెళ్లి బాబు రైతు సంఘం నాయకులు గుండా నాగేష్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు దాగం మల్లేష్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ బ్రాంచ్ ప్రచార కార్యదర్శి బి వెంకట స్వామి బొంకురి రామచందర్, పులి శంకర్, లక్ష్మీనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, రవి నాయక్ అశోక్ కుమార్ ఏం రవీందర్ ఏం చైతన్యకుమార్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, దాసరి దానయ్య, హెల్త్ ఊరి శంకర్, కాంపల్లి నారాయణ, ఆవునూరి రాజు చిప్ప కుర్తి బాపు, అంజి, ఆర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.