గుడిసెల పోరాటం నికి మద్దతు సీపీఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ

Published: Saturday October 15, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధిఅబ్దుల్లాపూర్మెట్ గ్రామంలో సర్వేనెంబర్ 283 గుడిసెలు వేసుకున్న వారికి మద్దతు తెలియజేస్తూ తెలంగాణ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ , సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య . కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ, సామిల్ , గుడిసెలు వేసుకున్న నిరుపేదలను, వారి దగ్గరికి వెళ్లి వారికి మద్దతు తెలియజేస్తూ, గుడిసె వాసులందరికీ , ఈ తెలంగాణ ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని, వారందరి కూడా పట్టా సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సర్వే నెంబర్ లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న పట్టించుకునే నాధుడు లేడు, పేదలు మాత్రం, 60 గజాలు కావాలని గుడిసెలు వేసుకుంటే ఈ ప్రభుత్వం వాళ్లు, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, అబ్దుల్లాపూర్ గ్రామంలో గుడిసెలు వేసుకున్న పేదవారికి న్యాయం జరిగేంత వరకు వీరికి అండగా ఉంటామని, ఈ తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని 493 జీవోను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్టు మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ, సిపిఎం మండల కమిటీ సభ్యులు గుండె శివ కిరణ్, మైసమ్మ లలిత, శివ, అనిత రామా దేవి, పాల్గొన్నారు. జాన్ వెస్లీ . గుడిసెలు వేసుకున్న వారిని గుడిసెలను పరిశీలించడం జరిగింది.