దళిత బంధు పథకం ద్వారా మంజూరైన సెంట్రింగ్ యూనిట్ ప్రారంభం.
Published: Saturday October 08, 2022
ఎర్రుపాలెం అక్టోబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మండల పరిధిలోని శుక్రవారం నాడు బనిగండ్లపాడు గ్రామానికి చెందిన రామాల వసంత్ దలిత బంధు కు ఎంపికై బనిగండ్లపాడు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసినటువంటి సెంట్రింగ్ యూనిట్ ను ఎంపీడీవో బి. శ్రీనివాస్, సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, పెద్ద గోపవరం సొసైటీ అధ్యక్షులు శీలం అక్కిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలను జాగ్రత్తగా వినియోగించుకుని వారి కుటుంబాల్లో ఆనందం జీవితం నడపాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, ఉప సర్పంచ్ రామకృష్ణ, యన్నం పిచ్చి రెడ్డి, వేమిరెడ్డి రామిరెడ్డి, మేమిరెడ్డి వెంకట్ రెడ్డి, దాసరి మోక్షం, ఏసు దానం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: