ధరణి డయల్ ఇన్ గ్రీవెన్స్ 20 ఫిర్యాదులు : జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
Published: Thursday August 26, 2021
వికారాబాద్ బ్యూరో 25 ఆగస్ట్ ప్రజాపాలన : భూ సమస్యల సత్వర పరిష్కారం కొసం బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నిర్వహించిన "డయల్ ఇన్ గ్రీవెన్స్ " కార్యక్రమంలో ఫోన్ కాల్స్ ద్వారా (20) ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధరణి సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరించడం జరుగుతుందని వారు సూచించారు. ప్రజల భూ సమస్యల సత్వర పరిష్కారం కొసం ప్రతి బుధవారం నిర్వహించే "డయాల్ ఇన్ గ్రీవెన్స్" ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నం.08416256989 కు కాల్ చేయాలని వారు ఈ సందర్బంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఈడిఎం మహమూద్ అలీ, ధరణి కోఆర్డినేటర్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: