వర్షాకాలం అత్యవసర బృందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Tuesday June 01, 2021

పటాన్చేరు, ప్రజాపాలన ప్రతినిధి : జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో రాబోయే వర్షాకాలం కోసం ఏర్పాటు చేసిన మూడు అత్యవసర బృందాలను పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చేరు సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లకు ఒక్కో బృందాన్ని కేటాయించినట్లు తెలిపారు. ప్రతి బృందంలో ఒక ఆటో, విపత్తు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జీహెచ్ఎంసీ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.