దానాలన్నింటిలో అన్నదానం మిన్న

Published: Monday February 15, 2021

ఎంకెఆర్ సంస్థ సభ్యులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14 ( ప్రజాపాలన ) : దానాలన్నింటిలో అన్నదానం మిన్న అని ఎంకెఆర్ సభ్యులు అనిల్, పరమేష్ లు అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని ధన్నారం గ్రామ సమీపంలోని స్వామి వివేకానంద గురుకుల ఎక్సలెన్స్ యజ్ఞ అనాథ ఆశ్రమ విద్యార్థులకు ఆహార పదార్థాలతో పాటు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్టపడి సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో మాకు తోచిన సహాయం చేస్తున్నామని వివరించారు. మాకు ఆర్థికంగా చేయూతనిచ్చిన ఎంకెఆర్ సంస్థకు ఎంతో రుణపడి ఉంటామని పేర్కొన్నారు. మేము సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని అనాథ ఆశ్రమ విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఈ పని చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనిల్, పరమేష్, సురేష్, రాజు, శివరాం, ప్రశాంత్, శ్రీను, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.