కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచండి

Published: Monday April 26, 2021
కార్పొరేటర్  శ్రీవాణి వెంకట్ రావు
 మేడిపల్లి, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : రామంతపూర్ డివిజన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచాలని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు డిహెచ్ఎంఓ డాక్టర్ మల్లికార్జున్ కు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెల మే నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న నేపథ్యంలో 18 సంవత్సరాలు పైబడిన వారు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటారు కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న సెంటర్లు సరిపో నందున ముందు జాగ్రత్తగా రామంతపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఎస్ఎంఆర్ అపార్ట్మెంట్, బస్తి దావఖానలు, కమిటీ హాల్స్ లలో ఇంకా కొన్ని. కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిహెచ్ఎంఓ డాక్టర్ మల్లికార్జున్ ను కోరమని కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు తెలిపారు. డాక్టర్ వెంటనే స్పందించి  పై అధికారులతో మాట్లాడి సెంటర్లు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.