సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు వరదాచారి,కె ఎల్ రెడ్డి ల శ్రద్ధాంజలి సభ... హాజ

Published: Friday November 11, 2022
సీనియర్ పాత్రికేయులు జి ఎస్ వరదాచారి,కె ఎల్ రెడ్డి ల శ్రద్ధాంజలి సభను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ల సంఘం, వయోధిక పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. ఈ సభలో గవర్నర్ బండారు దత్తాత్రేయ,రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు, సీనియర్ జర్నలిస్ట్ లు శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ,కె. కేశవరావు లు మాట్లాడుతూ జర్నలిజానికి వరదాచారి,కె ఎల్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతీ జర్నలిస్ట్ కు వారిరువురు ఆదర్శం అన్నారు.నీతికి,నిజాయితీకి మారుపేరుగా వరదా చారి జీవించారన్నారు. ఏ ఒక్క మచ్చ, విమర్శ లేని వ్యక్తిత్వం ఆయనదని,
తెలుగుతో పాటు అంగ్లంలోనో మంచి ప్రావీణ్యం వారిరువురికి ఉందని,తెలుగుపై ఉన్న ప్రేమతో ఇందులోనే కొనసాగారని తెలిపారు.సీనియర్ జర్నలిస్ట్ రామ చంద్ర మూర్తి మాట్లాడుతూ ఇద్దరూ గొప్ప పాత్రికేయులని, నిండు జీవితం జీవించారన్నారు.వారి విలువలు పాటిస్తూ ఇతరులకు చెప్పడమే వారికి గొప్ప నివాళి అన్నారు.ఈ కార్యక్రమం లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు వేణుగోపాల నాయుడు, రవికాంత్ రెడ్డి,చక్రధర్,విరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.