మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెహ్రూ కు ఘన నివాళి

Published: Saturday May 28, 2022

మెట్ పల్లి, మే 27 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర్య సమర యోధుడు పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని ఆయన చిత్ర పటానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లింగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందె మారుతి బాపూజీ, ముఖీమ్, పొట్ట ప్రేమ్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు కోటగిరి చైతన్య, దోమకొండ రమేష్, బండి రాజేందర్ గౌడ్, లింబాద్రి రాజు, రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.