*క్రీడా ప్రాంగణ ప్రదేశాన్ని పరిశీలించిన ఏ పి డి ఎంపీడీఓ

Published: Saturday February 04, 2023

మధిర ఫిబ్రవరి 3 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలోదెందుకూరు గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి 

ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నందు తెలంగాణ క్రీడా ప్రాంగనము నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చుంచు శ్రీనివాసరావు, ఎంపిడిఓ కుడుముల విజయభాస్కర్ రెడ్డి లు పరిశీలించారు. క్రీడా ప్రాంగణం పనిని త్వరగా పూర్తి చేయాలనీ  క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనూష, టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.*