రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు

Published: Monday October 18, 2021
బాలాపూర్, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ప్రజలందరికీ రంగురంగుల పూలతో బతుకమ్మ పండుగ గొప్పదనం గురించి, విజయదశమి పండుగ విశిష్టత సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జరుపుకున్న వారందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలియజేశారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి ఫ్లోర్ లీడర్ ఆర్కల భూపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేలు ఇచ్చి బతుకమ్మ, దసరా విశేషాలు చర్చించుకొని, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు పద్మా రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు మీర్ పేట్ కార్పొరేటర్లు సురేఖ రమేష్, జ్యోతి కిషోర్, పద్మ అంజయ్య, రేఖా లక్ష్మణ్, ఇంద్రావత్ రవి నాయక్, కో-ఆప్షన్ సభ్యులు పల్లె జంగయ్య, రవి నాయక్, ఎస్ టి  సెల్ హము నాయక్, కార్మిక అధ్యక్షుడు జంగయ్య, టిఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, లలిత జగన్, రేణుక, నిర్మల, ప్రవీణ్ రెడ్డి, కేమధ్రి, అర్జున్, శేఖర్ రెడ్డి, రవీందర్ చారి, రావేందర్ రెడ్డి, జోజీ, కుమార్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.