వల్లభి వెంకయ్యకు నివాళులర్పించిన సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్

Published: Thursday January 20, 2022
బోనకల్, జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన వల్లభి వెంకయ్య బుధవారం నాడు అకాల మరణం చెందగా వారి పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండి గోవిందు, బోయిన పల్లి లక్ష్మీనరసింహ, బోయినపల్లి సైదులు, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, బంధం రామారావు, బోయిన పల్లి చిన్న వెంకయ్య, బోయిన పల్లి చిన్నపయ్య, బోయినపల్లి కృష్ణయ్య, భూక్యా లాక్యా, బోయిన పల్లి నరసింహారావు, అచ్యుతరావు, పుల్లయ్య మరియు బోయిన పల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.