రాంపూర్ గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Published: Thursday November 18, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 17 నవంబర్ ప్రజాపాలన : క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికే ప్రజా క్షేత్రంలోకి వస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం కోటపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా గల్లీ గల్లీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాంపూర్ గ్రామ రైతులకు పంట పొలాల్లోకి వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉన్న పానాది (పార్మిషన్) రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఊరు మధ్యలో పాడు బడ్డ ఇళ్లను వెంటనే తొలగించి, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు పారిశుద్య కార్మికులతో శుభ్రపరచాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు. పాత బావులపై పైకప్పులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ నీటి పైపుల లీకేజీలు లేకుండా, నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.