M.E.O ప్రభాకర్.నిరుపేద విద్యార్థికి చరవాణి బహూకరణ

Published: Saturday June 19, 2021
మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్ లోని సెంటర్ అఫ్ ఎక్సెలెన్స్ (COE) ఇంటర్ కాలేజీలో ప్రవేశానికి అర్హత సాధించిన మాటూరు (విద్యానగర్)కు చెందిన వేల్పుల సందీప్ అనే విద్యార్థి ఆర్థిక పరిస్థితి గమనించిన మోటమర్రి ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ చేడే శ్రీనివాస్ తన మిత్రురాలి ఆర్థిక సహాయంతో మండల విద్యాశాఖాధికారి శ్రీ Y. ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఆ విద్యార్థికి చరవాణి బహూకరించడం జరిగినది. ఇదే సందర్భంలో దెందుకూరు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని తాళ్లూరు రిషితకు మరియు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు పరిశ రాము మరియు మల్లా ప్రవీణ లకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చేడే శ్రీనివాస్, సంక్రాతి శ్రీనివాసరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, సుగ్గల రామకృష్ణారావు, మరియు వ్యాపారస్తులు గార్లపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.