తెరాస నాయకుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే
Published: Wednesday May 12, 2021
పరిగి, మే 11, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రానికి చెందిన జిల్లా గ్రంథాలయ శాఖ డైరెక్టర్ యాదయ్య గౌడ్ జర్నలిస్ట్ వెంకటయ్యలకు పితృ వియోగం జరగడంతో వారి కుటుంబ సభ్యులను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారిని పరామర్శించటం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు మండలపరిధిలో కోవిడ్ వ్యాప్తి పరిస్తుతులపై సర్పంచ్ కె రాజిరెడ్డి ని అడిగి తెలుసుకొని అనంతరం వైద్యులు డా.మునిబ్తో ఫోన్ లో మాట్లాడారు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ఎలాంటి చెర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. టెస్టుల సంఖ్యను పెంచి వ్యాక్సిన్ కూడా అందరికి అందేలా చూడాలని అన్నారు.
Share this on your social network: