మునుగోడులో ప్రభాకర్ రెడ్డి గెలుపుతో పీర్జాదిగూడలో మేయర్ కార్పొరేటర్లు సంబరాలు మేడిపల్లి, న

Published: Tuesday November 08, 2022

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  ఘన విజయం సాధించడంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (క్యాంప్ కార్యాలయం)వద్ద మేయర్ జక్క వెంకట్ రెడ్డి,కార్పొరేటర్లు, కొ ఆప్షన్ సభ్యులు,టీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కలసి భారీ బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు.ఈ సందర్బంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికల కోసం గత నెల రోజులు ప్రచారం నిర్వహించి పార్టీ కోసం శ్రమించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హరి శంకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, కౌడే పోచయ్య, సుభాష్ నాయక్, నవీన్ రెడ్డి, అనంతరెడ్డి, మధుసూదన్ రెడ్డి, బచ్చ రాజు టీఆర్ఎస్ నాయకులు బండారు రవీందర్, బొడిగె కృష్ణ, మనోరంజన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.