సామినేని వారి త్రాగునీటి వితరణ
మధిర, మార్చి1, ప్రజాపాలన ప్రతినిధి విదేశాల్లో స్థిర పడినప్పటికీ మాతృభూమి పై మమకారం తో శ్రీ సామినేని నాగేశ్వరరావు గారి తనయుడు శ్రీ సామినేని రవి తన స్వగ్రామం అయిన మధిర మండలం, మాటూరుపేట గ్రామంలో నీటి శుద్ధి యంత్రానికి కావలసిన స్థలం మరియు పూర్తి నిర్మాణ వ్యయాన్ని భరించాలని గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమిపూజ కార్యక్రమం తనకు అత్యంత ఆప్తులు అయిన శ్రీ లేటు నెల్లూరి వెంకటేశ్వర్లు గారి తనయుడు నెల్లూరి రవి దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా మాటూరుపేటకు చెందిన పలువురు గ్రామ పెద్దలు సామినేని రవి ని వేనోళ్ల అభినందించారు. గతంలో కూడా పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాదల రామారావు గారు, కరణం పురుషోత్తం గారు, మాదల నరసింహారావు గారు, గండ్ర నరసింహారావు గారు, కొర్లగంటి వెంకటేశ్వర్లు గారు, పోతినేని నరసింహారావు గారు, నెల్లూరి బాబురావు గారు, సంక్రాంతి పుల్లయ్య గారు, కరణం రాంబాబు, గడ్డం వాసు, మాదల చిట్టిబాబు, భద్రం, కరణం తరుణ్ మరియు గ్రామ యువత పెద్ద యెత్తున పాల్గొన్నారు.
Share this on your social network: