సమస్యలపై విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Wednesday March 29, 2023
మేడిపల్లి, మార్చి 28 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లో సమస్యలపై స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు జరమండలి అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.           ఈ మేరకు కార్పొరేటర్ డివిజన్లోని
 బాలకృష్ణ నగర్, సాయి క్రిష్ణ నగర్, శ్రీనగర్ కాలనీలలో కొత్త సివరేజ్ లెన్స్   కోసం సోమవారం జలమండలి ఆఫీసులో డిఓపి  స్వామిని కలిసి ఆ కాలనీలలో ప్రజలు పడుతున్నటువంటి అవస్థల గురించి  వివరించారు. వెంటనే స్పందించిన డిఓపి స్వామి జలమండలి అధికారులకు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మంగళవారం సిజిఎం సుజాత, జిఎం సంతోష్ కుమార్, మేనేజర్ రవీందర్       డివిజన్లోని ఆ కాలనీలలో కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సిజిఎం సుజాత మాట్లాడుతూ వెంటనే కొత్త లైన్ల కోసం ఎస్టిమేషన్ వేసి ప్రపోజల్ కు పంపిస్తామని, తొందరలోనే కొత్త లైన్లకు అనుమతి వస్తుందని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకటరావు, రేపు నరసింహ, కాలనీ వాసులు మహేశ్వర్ రెడ్డి, పడియం నాగేష్, పరిశీనివాస్, కీర్తి ముదిరాజ్, టీకా రెడ్డి, శర్మ, తదితరులు పాల్గొన్నారు.