మార్చి 3న మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మధిర రూరల్ ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి

Published: Tuesday February 28, 2023

మధిర మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మార్చి 3న తేదీన ఉదయం 10:30 గంటలకు ఎంపీపీ మెండెం లలిత అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి సోమవారం తెలిపారు. గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశానికి హాజరయ్యే మండల స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను తక్షణమే అందజేయాలన్నారు.