శంకరపట్నం భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శంకరపట్నం డిసెంబర్ 26 ప్రజాపాలన రిపోర

Published: Tuesday December 27, 2022

భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం  సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య ఆద్వర్యంలో సోమవారము నిర్వహించారు. శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, కొత్తగట్టు, తాడికల్ గ్రామాల్లో సి.పి.ఐ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ దేశంలో గత 97 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలు పెరగని పోరాటాలు నిర్వహించిందని పేద ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం,  కొత్తగట్టు గ్రామ సిపిఐ కార్యదర్శి జాన పట్ల దేవయ్య, తాడికల్ గ్రామ సిపిఐ కార్యదర్శి వెంకటేశు, ఏఐటియుసి మండల కార్యదర్శి ఎండి బాదుల్లా, పార్టీ నాయకులు పిట్టల తిరుపతి, శ్రీనివాస్, రాజు, రవి, హైదర్, సదయ్య రాజు, పోచయ్య ,నాగూరు కన్నయ్య మరియు పార్టీ కార్యకర్తలు కూలీలు రైతులు పాల్గొన్నారు