లాలు అంత్యక్రియలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ఆర్థికసాయం ఎస్ కె ఆర్ ట్రస్ట్ చైర్మన్ సనగారి కొండల్ రె

Published: Wednesday May 25, 2022
వికారాబాద్ బ్యూరో 24 మే ప్రజాపాలన :
పట్లూర్ గ్రామ వార్డు సభ్యుడు లాలు అంత్యక్రియలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం చేశామని ఎస్ కె ఆర్ ట్రస్ట్ చైర్మన్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ కొండల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్  గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బోయిని లాలు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చి సోమవారం రాత్రి మృతి చెందాడు. అట్టి విషయం తెలుసుకున్న *ఎస్ కె ఆర్ ట్రస్ట్ చైర్మన్, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ కొండల్ రెడ్డి* లాలు అంత్యక్రియలకు పంపిన నగదును పంచలింగాల్ *సర్పంచ్ సురేందర్ రెడ్డి* మంగళవారం పట్లూర్ గ్రామంలోని మృతుడి ఇంటికి వెళ్లి కుటంబ సభ్యులను పరామర్శించారు. లాలు అంత్యక్రియలకు ఎస్ కె ఆర్ ట్రస్ట్ ద్వారా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అశోక్ నాయకులు గడ్డం నర్సింహులు, యాదవ్ రెడ్డి  తదితరులు ఉన్నారు...