పంచాయతీ నిధులు స్వాహా పై విచారణ చేపట్టాలి కలెక్టర్ కు వినతి ...

Published: Tuesday June 28, 2022
పాలేరు జూన్ 27 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని మోటాపురం గ్రామ పంచాయతీ లో నిధుల వినియోగం పై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు గ్రామానికి చెందిన సోసైటీ మాజీ డైరెక్టర్ రావెళ్ల కృష్ణారావు సోమవారం ఫిర్యాదు చేశారు. పంచాయతీ తీర్మానాలు లేకుండానే బిల్లులు డ్రా చేశారని, నోట్ పైల్స్ పై సంతకాలు చేయకుండా డ్రా చేశారని ఆరోపించారు. నిధులు డ్రా చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని. కార్యదర్శి బాధ్యతలు విస్మరించారని ఆరోపించారు. నిధులు దుర్వినియోగం జరిగిందని వాటిపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.