స్వచ్ఛ ఆటో వాలంటీర్ల పనితీరును పరిశీలించిన మేయర్ కార్పొరేటర్

Published: Saturday December 31, 2022
మేడిపల్లి, డిసెంబరు 30 (ప్రజాపాలన ప్రతినిధి) 
స్వచ్ఛ సర్వేక్షన్ 2022-2023లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్లో స్థానిక  కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డితో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆయా   కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా తడి,పొడి చెత్త మరియు హానికరమైన చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలను, స్వచ్ఛ వాలంటిర్ల్ పనితీరును పరిశీలించారు. సోర్స్ సెక్రిగేషన్ 25వ డివిజన్లో ఉన్న ప్రతి ఇంటి గృహ వర్ధ్యాలను తడి,పొడి,మరియు హానికరమైన చెత్తను విడిగా వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు అందిచాలని మేయర్ కోరారు.
 అనంతరం కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్రెడ్డి మాట్లాడుతూ తడి చెత్త,పొడి చెత్త,హానికరమైన చెత్తను వేరు చేసి అందిస్తూ స్వచ్ఛ పీర్జాదిగూడ నిర్మాణంలో భాగస్వాములు అయినందుకు డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్సై జానకి,జగన్మోహన్,మురళి,కాలనీ వాసులు,మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.