పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ

Published: Friday July 15, 2022
కోరుట్ల, జూలై 14 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల పురపాలక సంఘం లోని పారిశుధ్య కార్మికులకు భారీ వర్షాలు పడుతున్న కారణంగా కలెక్టర్ , ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఆదేశాల మేరకు చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మెన్ గడ్డమీది  పవన్, కమిషనర్ ఎండీ అయాజ్ చేతుల మీదుగా   గురువారం రోజున పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మి నారాయణ,శానిటరీ ఇన్స్పెక్టర్ ,హెల్త్ అసిస్టెంట్,  మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.