*కొందుర్గు మండలములోని వెంకీరాల గ్రామంలో ఎస్ డి ఎఫ్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమ్*

Published: Friday January 06, 2023

*ప్రజాపాలన కొందుర్గు :-కొందుర్గు మండల  పరిధిలోని వెంకీరాల  గ్రామంలో సీసీ రోడ్డు పనులను  ప్రారంబించిన (చెరుకుపల్లి ఎంపీటీసీ సభ్యులు) మండల వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  షాద్ నగర్  గౌరవ  ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  సహకారం  తో  వెంకీరాల గ్రామంలోని కమ్మరి  రామచెంద్రయ్య  ఇంటి నుండి ఆ కాలనీ  ప్రక్క కాలనీ లు కలుపు కొని కటికే మైబుజి ఇంటి చివరి  వరకు  5.0లక్షల  రూపాయల  వ్యయంతో సీసీ రోడ్డు పనులు  ప్రారంభించటం జరిగింది అన్నారు.రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గ్రామాలలో అబివృద్ది పనులకు ప్రతి పాదనలు తీసికున్నారు అని, సమయం  ఎప్పుడు వచ్చిన  మన  ఎమ్మెల్యే అంజయ్య  యాదవ్  గారి వెంట  గ్రామాబి వృద్ధి కి గ్రామస్తులు కలసి రావాలి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  రాజమోని లింగం  గౌడ్,పంచాయతీ  కార్యదర్శి  శ్రీకాంత్ రెడ్డి,జడ్పీటీసీ కుమారుడు ఎదిర రామ కృష్ణ,brs పార్టీ కొందుర్గు మండల అధ్యక్షులు విశ్వ నాథ్ పూర్ సర్పంచ్ ఎలుగంటి శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాసయ్య గౌడ్, చెక్కలి  గోవింద్, brs గ్రామ కమిటీ  అధ్యక్షులు చిన్న లింగం గౌడ్, వెంకటేశ్వర  దేవాలయ కమిటీ  చైర్మన్ కొ లుముల రామ కృష్ణ, pacs డైరెక్టర్ గిర్మీ నర్సిములు, మోత్కూరి మల్లేష్, కుంటోళ్ల పెంటయ్య, కుంటోళ్ల వెంకటేష్, చెక్కలి శంకరయ్య, రాఘవేందర్ గౌడ్, చెక్కలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు*