బోడుప్పల్ 22వ డివిజన్లో రూ 6 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం
Published: Thursday February 03, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 2 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ న్యూహేమ నగర్లో రూ 6 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజ్ పనులను స్థానిక కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహేశ్వరి కృప సాగర్ ముదిరాజ్ మాట్లాడుతూ డివిజన్ను దశలవారీగా అభివృద్ధి చేస్తూ, డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొంతర బోయిన కృపసాగర్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు బొమ్మక్ బాలయ్య, 22వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పొకల రవీందర్ ముదిరాజ్, 10వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెల్లంకి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు జగన్ ముదిరాజు, న్యూహేమ నగర్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అలాగే కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: