అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వార్షికోత్సవం

Published: Thursday August 04, 2022

కోరుట్ల, ఆగస్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని 22వ వార్డు బిలాల్ పూర అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సి.డి.పి.ఓ తిరుమల దేవి ముఖ్య అతిథిగా హాజరై తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రసవం తర్వాత గంటలోపు పట్టించే ముర్రుపాలెం ప్రాముఖ్యత గురించి వివరించారు ఆరు నెలలు నిండే వరకు కచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఏడు నెలల నుండి ఇతర ఆహార పదార్థాలు అలవాటు చేస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని, ఈ ప్రకారంగా  శిశువుల గురుంచి, తల్లి యొక్క పాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఆచరించి విధంగా చూడడం వలన ఒక మిలియన్ చిన్నారుల జీవితాలను కాపాడినవారం అవుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రేమలత, అంగన్వాడీ టీచర్ హైమది బేగం, ఆయా రాణి,  ఏఎన్ఎం,  ఆశ వర్కర్, గర్భిణీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.