22వ డివిజన్లో సమస్యలపై పర్యటించిన మేయర్ సామల బుచ్చిరెడ్డి

Published: Friday September 30, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) 

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్లో పలు సమస్యలపై స్థానిక కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృప సాగర్ ముదిరాజ్ తో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి పర్యటించారు. ఈదయ్య నగర్, నవోదయ కాలనీలలో మెయిన్ లైన్ కి సబ్ లైన్ కనెక్షన్ ఇచ్చినట్లయితే ఎటువంటి నీటి సమస్య ఉండదని  కార్పొరేటర్ మహేశ్వరి కృప సాగర్ మేయర్ కు విన్నవించారు.  వెంటనే మేయర్ వాటర్ బోర్డు మేనేజర్ తో మాట్లాడి సబ్ లైన్ కనెక్షన్లు త్వరగా ఇవ్వాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొంతరబోయిన కృపా సాగర్ ముదిరాజ్, డీఈ శారద, ఆర్ ఐ కోట వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.