ఎస్ ఎల్ ఎన్ ఎస్ కాలనీలో గణనాథుని లడ్డు 1.56 లక్షలకు కైవసం చేసుకున్న పంగీలా వెంకటేష్

Published: Thursday September 23, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి కాలనీ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుల తో పాటు అధ్యక్షులు దిండు భూపేష్ గౌడ్ విగ్నేశ్వర లడ్డును దక్కించుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ ఎల్ ఎన్ ఎస్ కాలనీలో గణనాథుని ప్రతిష్టించి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బుధవారం గణనాథుని  శోభ యాత్ర భాగంలో ఎస్.ఎల్. ఏన్ ఎస్ కాలనీ గణేశూ ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డు వేలం పాటలో పాల్గొని ఆ దేవదేవుని లడ్డు ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలకు కైవసం చేసుకున్న పంగిలా వెంకటేష్. ఉత్సవ సమితి అధ్యక్షులు దిండు భూపేష్ గౌడ్ సభ్యులు కలిసి గణనాథుని లడ్డు ను పంగిళా పద్మ వెంకటేష్ కు అందజేశారు. వెంకటేష్ మాట్లాడుతూ....ఎన్నో సార్లు లడ్డు దక్కించుకోవాలని ప్రయత్నించిన ఇప్పటికి నా ప్రయత్నం ఫలించిందిని నాపై ఆ దేవుని ఆశీర్వాదం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎల్ ఎన్  ఎస్  కాలనీ పెద్దలు, మహిళా మణులు, తదితరులు పాల్గొన్నారు.