మానవత్వంతో రోడ్డున పడిన బాలింతను అక్కున చేర్చుకున్న కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Friday May 21, 2021
మేడిపల్లి, మే20 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి గొప్ప మనసు, మానవత్వంతో రోడ్డున పడిన బాలింతను అక్కున చేర్చుకున్నారు. ఉప్పల్-నాగోల్ మార్గంలో మెట్రో రైలు ఫిల్లర్ నెంబర్ 821 ప్రాంతంలో ఇటీవల మున్సిపల్ అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఇక్కడ గుడిసెలలో ఉండే ఐదు రోజుల బాలింత సైతం రోడ్డున పడింది. అంగన్ వాడీ, హెల్త్ సూపర్ వైజర్ ల ద్వారా విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి చలించిపోయారు. సాటి మహిళగా వెంటనే స్పందించారు. గురువారం అంగనవాడీ, హెల్త్ అధికారులు, సిబ్బందితో కలిసి బాలింతను కలిశారు. తన వంతు సహాయాన్ని అందించడంతో పాటు మహిళా శిశు సంక్షేమ నుంచి కూడా కావాల్సిన సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ స్వాతి, పార్వతి,  సీహెచ్ఓ గొంగిడయ్య, ఉమామహేశ్వరి, సునీత, సంధ్యారాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.