తెలంగాణ జాగృతి కమిటీలు నియామకం...

Published: Tuesday June 22, 2021
బీరుపూర్, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని మండల జాగృతి కన్వీనర్ నారపాక రవీందర్ మరియు కాల్వ హరీష్ వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో రంగసాగర్ కమ్మునూర్ గ్రామాల్లో జాగృతి కమిటీలను నియమించారు. రంగసాగర్ గ్రామ అధ్యక్షులుగా మేడిశెట్టి మహేష్ ఉపాధ్యక్షునిగా బోడ సురేష్ ప్రధాన కార్యదర్శిగా మేకల మల్లేష్ ఎన్నికయ్యారు. కమ్మునూర్ గ్రామ అధ్యక్షుడుగా పుదారి జగదీష్ ఉపాధ్యక్షునిగా బందెల సతీష్ ప్రధాన కార్యదర్శిగా బందెల ప్రేమ్ సాగర్ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ జాగృతి అధ్యక్షులు మ్యాదరావేణి మల్లేష్ పర్వతం మహేందర్ నారపాక శేఖర్ పర్వతం సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నారపాక రవీందర్ నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.