ఉప్పల్లో డివికె కన్స్రక్షన్స్ కార్యాలయం ప్రారంభం

Published: Tuesday November 30, 2021
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఒక కల, ఆ కల నెరవేర్చుకోవడం ఈ రోజుల్లో కొందరికి కష్టమైన పని అలాంటి వారి కోసం ఆకర్షణీయమైన ఇంటి ప్లాన్, నిర్మాణాల కోసం, అర్బన్ ప్లాన్ కోసం ఉప్పల్లో డివికె. కన్స్రక్షన్ కంపెనీ కొలువుతీరింది. ఉప్పల్ ప్రధాన రహదారిలో ప్రజాదర్బార్ శర్మ కాంప్లెక్స్ లో సోమవారం డివికె కన్స్రక్షన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలలో సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీర్ పనులకోసం ఈ ప్రధాన కార్యాలయంను ఏర్పాటు చేశామని సంస్థ ఎం.డి. డివి.కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ తక్కువ బడ్జెట్ లో విలువైన నిర్మాణం ఎలా? అన్నది చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి వారికి చక్కని పరిష్కారం చూపడం కోసం మా ప్రయత్నం. ఇప్పటివరకు ఎంతో మందికి మా సేవలు అందించాం. తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో మా సేవలు అందిండానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.