సిరిపురం గ్రామంలో దశదిన కార్యక్రమానికి హాజరై నివాళ్ళు అర్పించిన బొమ్మెర రామ్మూర్తి
Published: Tuesday August 03, 2021
మధిర, ఆగస్టు 02, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల అనారోగ్య కారణంతో సిరిపురం గ్రామానికి చెందిన చిన్న బుచ్చయ్య పెద్ద మాదిగ మృతి చెందారు. ఈరోజు అతని దశదిన కార్యక్రమం కు హాజరైన మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కుటుంబానికి బొమ్మెర ఫౌండేషన్ తరఫున 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిపురం గ్రామ సర్పంచ్ కనకపూడి పెద్ద బుచ్చయ్య , గ్రామ వార్డు మెంబర్లు, తెరాస నాయకులు గొల్లమందల మోహన్ చైతన్య, గ్రామ తెరాస నాయకులు కనకపూడి శ్రీను, కనకపూడి మురళి, కనకపూడి ప్రభాకర్, కనకపూడి సుధాకర్, రామకృష్ణ, కనక పూడి ప్రవీణ్, మొదలగు నాయకులు పాల్గొన్నారు...
Share this on your social network: