సిరిపురం గ్రామంలో దశదిన కార్యక్రమానికి హాజరై నివాళ్ళు అర్పించిన బొమ్మెర రామ్మూర్తి

Published: Tuesday August 03, 2021
మధిర, ఆగస్టు 02, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల అనారోగ్య కారణంతో సిరిపురం గ్రామానికి చెందిన చిన్న బుచ్చయ్య పెద్ద మాదిగ మృతి చెందారు. ఈరోజు అతని దశదిన కార్యక్రమం కు హాజరైన మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కుటుంబానికి బొమ్మెర ఫౌండేషన్ తరఫున 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిపురం గ్రామ సర్పంచ్ కనకపూడి పెద్ద బుచ్చయ్య , గ్రామ వార్డు మెంబర్లు, తెరాస నాయకులు గొల్లమందల మోహన్ చైతన్య, గ్రామ తెరాస నాయకులు కనకపూడి శ్రీను, కనకపూడి మురళి, కనకపూడి ప్రభాకర్, కనకపూడి సుధాకర్, రామకృష్ణ, కనక పూడి ప్రవీణ్, మొదలగు నాయకులు పాల్గొన్నారు...