తెలంగాణ రైతన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త.. హర్షం వ్యక్తం చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కా

Published: Wednesday December 21, 2022

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చొప్పల గ్రామపంచాయతీ విప్పల గుంపు గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  మంగళవారం నాడు పరిశీలించడం జరిగింది, ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని సమన్వయంతో పనిచేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు, ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో కట్టించి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని మంచి ఆలోచనలతో సీఎం కేసీఆర్  డబుల్ బెడ్ రూమ్ పథకం గ్రామాల్లో పట్టణాల్లో కట్టించి ఇస్తున్నారని అని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.