కబ్జా గురైన ప్రభుత్వ భూమిని కాపాడండి

Published: Friday December 24, 2021
ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్
బెల్లంపల్లి: డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండలంలోని కన్నాల శివారులో సర్వే నంబర్ 60లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకొని భూమిని స్వాధీనం చేసుకోవాలని చాకే పల్లి ఎంపీటిసి (కాంగ్రెస్ పార్టీ)ముడిమడుగుల మహేందర్)గురువారం నాడు బెల్లంపల్లి ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వేనెంబర్ 60లో గల ప్రభుత్వ భూమి జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంవల్ల కోట్ల రూపాయల విలువ చేసే అట్టి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు, ప్రభుత్వ అధికారులు వేసిన పెన్సింగ్ ను తొలగించి  అట్టిభూమిని కబ్జా చేశారని వారిని గుర్తించి ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని హద్దులు నిర్ణయించాలని, కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  అన్నారు.