ప్రధాని అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు

Published: Tuesday January 11, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండలం వెంకటేశ్వర ఆలయం ఉప్పరిగూడ గ్రామంలోని బిజెపి అధ్యక్షుడు దండే శ్రీశైలం ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. పంజాబ్ రాష్ట్రలో దేశ ప్రధాని నరేంద్రమోడీ కాన్వాయ్ ని రాక్షస దృక్పథంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా 20 నిమిషాలకుపైగా నిలిపి వేశారని ఆయన ఆయురారోగ్యాలు కాపాడాలని. శత్రుపీడ నాశనం కావాలని హోమం  నిర్వహించాo బీజేపీ నాయకులు. దిగ్విజయంగా మరో పదేళ్లు ప్రధాన మంత్రిగా మోడీ ఉంటారని పంతులు ఆశీర్వచనం అందజేశారు. విశ్వగురువుగా కీర్తికెక్కుతున్న నరేంద్రమోడీ పేరుప్రతిష్టలు దెబ్బతీయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు కుట్ర చేస్తున్నాయని జాతీయ నాయకులు నల్లబోలు భోజి రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రనాయకులు ఏన్ను యాదగిరి రెడ్డి, జైపాల్ రెడ్డి యాదగిరి రెడ్డి, బుచ్చిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి గణేష్, విష్ణువర్ధన్ రెడ్డి, మోర్చ్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, కంబల్లపల్లి శ్వేతా శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి,వార్డు సభ్యులు జితేందర్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు రెడ్డి, శ్రీనివాస్,ఓం ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.