క్రీడా ప్రాంగణాల కొరకు స్థలాలను పరిశీలించిన ఆర్ ఐ బృందం

Published: Friday May 20, 2022

బోనకల్, మే 19 ప్రజా పాలన ప్రతినిధి: సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 2న ఎంపిక చేసిన క్రీడా ప్రాంగణాలను ఆయా గ్రామాలలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలతో గురువారం బోనకల్ మండల కేంద్రంలోని ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి క్రీడా ప్రాంగణాలు గా మార్చేందుకు మండల ఆర్ ఐ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు శారీరక దారుడ్యం మానసిక ఉల్లాసంతో ఎదిగే అందుకు తోడ్పడే విధంగా మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీ ఆదినంలో ఉన్న గ్రామ కంఠం భూములను ,ప్రభుత్వ స్థలాలను గుర్తించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సూచించారు. గ్రామాలలో క్రీడలను నిర్వహించడం కోసం సంబంధిత కమిటీలను కూడా నియమించనున్నట్లు తెలిపారు.