పారిశుధ్య కార్మికులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ

Published: Friday August 27, 2021
మేడిపల్లి, ఆగస్ట్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్లోని వార్డు ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు మాస్కులు, శానిటైజర్, డెటాల్ సబ్బులు, కోకోనట్ ఆయిల్ తదితర ఐటమ్స్ ఉన్న కిట్టును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షులు  బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్, బీజేపీ సీనియర్ నాయకులు రేవు నరసింహ కురుమ, వేముల వెంకట్ రెడ్డి, వేముల తిరుపతయ్య, ఇల్లిట్టం నరసింహారెడ్డి, సుధాకర్ యాదవ్, బుర్ర అఖిల్ తదితరులు పాల్గొన్నారు.