పారిశుధ్య కార్మికులకు మాస్కులు శానిటైజర్ పంపిణీ
Published: Friday August 27, 2021
మేడిపల్లి, ఆగస్ట్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్లోని వార్డు ఆఫీసులో పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు మాస్కులు, శానిటైజర్, డెటాల్ సబ్బులు, కోకోనట్ ఆయిల్ తదితర ఐటమ్స్ ఉన్న కిట్టును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షులు బండారు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్, బీజేపీ సీనియర్ నాయకులు రేవు నరసింహ కురుమ, వేముల వెంకట్ రెడ్డి, వేముల తిరుపతయ్య, ఇల్లిట్టం నరసింహారెడ్డి, సుధాకర్ యాదవ్, బుర్ర అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: