చంద్రబాబు సభను విజయవంతం చేయాలి

Published: Tuesday December 20, 2022

మధిర  డిసెంబర్ 19 (ప్రజా పాలన ప్రతినిధి) ఖమ్మం పట్టణంలో ఈ నెల 21న జరిగే టిడిపి ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ సభను విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం కోరారు. చంద్రబాబు నాయుడు సభను విజయవంతం చేయాలని కోరుతూ టిడిపి నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మధిర పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు మాట్లాడుతూ భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తుందని అన్నారు. టిడిపి అధికారంలో ఉంటేనే పేదవారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం జరుగుతున్న ఈ బహిరంగ సభకు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చేకూరి శేఖర్ బాబు, సాయి తులసి, మైనీడి జగన్, చెరుకూరి కృష్ణారావు, వీరమాచినేని నాగ సులోచన, పగిడిపల్లి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.