పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బంధువులు

Published: Thursday December 22, 2022

ప్రజాపాలన  విలేకరి
శంకరపట్నం డిసెంబర్ 21

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన కల్లూరి లింగమూర్తి నెల రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా బుధవారం రోజు వారి బంధువులు చెందాల రూపంలో డబ్బులు వసూలు చేసి అక్షరాల 90,000 ల రూపాయలను వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. బందువుల ధాతృత్వాన్ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో బంధువులు కుటుంబ సభ్యులు తధితరులు పాల్గొన్నారు.