రూరల్ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published: Wednesday May 05, 2021
పటాన్చెరు, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనీ రూరల్ హెల్త్ సెంటర్ ని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. రెండు రోజుల క్రితం ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసిన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో పడకల పెంపు కోసం ఆస్పత్రిలోని రెండవ అంతస్తులో గల రూరల్ హెల్త్ సెంటర్ ని వాడుకునేందుకు గల అవకాశాలను ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. అవసరమైన పక్షంలో ఆసుపత్రి సమీపంలోగల సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనం లోకి ఆర్ హెచ్ సి సెంటర్ ని తాత్కాలికంగా తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందితో కలిసి హాస్టల్ ను సందర్శించారు.
Share this on your social network: