విద్యుత్ శాఖ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023
మధిర ,మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మధిర విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ మహిళ ఉద్యోగినులైన జేఏవో రాజేశ్వరి, ఈఆర్వో సిబ్బంది కుమారి, కృష్ణకుమారి లను వైరా డివిజన్ 327 విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మహిళల పురోగతితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంటుందని, అందరూ సమానమైన హక్కులతో బాధ్యతాయుతంగా రాజ్యాంగ పరిధిలో విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా 327 యూనియన్ అధ్యక్షులు జి నరసింహారెడ్డి గారి కోరారు. ఈ కార్యక్రమంలో జే ఏ ఓ రవివర్మ, సీనియర్ అసిస్టెంట్ రమేష్, సబ్ డివిజన్ చెరుపల్లి శ్రీధర్, లైన్ ఇన్స్పెక్టర్లు హుస్సేన్, లైన్మెన్ జమీర్, జేఎల్ఎం అర్జున్, గోపి, రమేష్, తిరుపతి, రాజేష్ తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.