జడ్పి చైర్ పర్సన్ను కలిసిన మారేపల్లి రైతులు

Published: Friday June 18, 2021
వికారాబాద్, జూన్ 17, ప్రజాపాలన బ్యూరో : మా పంట పొలాలకు రోడ్డు వేయించి మా భూములకు విలువ పెంచారని మారేపల్లి రైతులు జడ్పి చైర్ పర్సన్ సునీతా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వర్షాకాలం వచ్చిందంటే పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీ చలువ వలన మా పొలాలకు సులువుగా వెళ్లి వస్తున్నాం..." అంటూ పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన రైతులు జడ్పి చైర్ పర్సన్ తో అన్నారు. గురువారం హైదరాబాద్ లోని సునీతారెడ్డి నివాసంలో స్థానిక సర్పంచ్ బల్వంత్ రెడ్డి తో కలిసి చైర్ పర్సన్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా సునీతారెడ్డి మాట్లాడుతూ పొలం పనులు వెళ్ళినప్పుడ రైతులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రాత్రి వేళల్లో పొలాల్లో పాములు తిరుగుతుంటాయని, అలాగే విద్యుత్ షాక్ లు తగలకుండా తగు జాగ్రతలతో పనులు చేసుకోవాలని రైతులకు సూచించారు. కరోనా ఉన్నందున ఎవరు కూడా తనను కలవడానికి హైదరాబాద్ రావద్దని విజ్ఞప్తి చేశారు.