ప్రజాసేవకే నా జీవితం అంకితం టీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి

Published: Monday November 28, 2022
మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)
నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఆదివారం మల్లాపూర్లోని విఎన్ఆర్ గార్డెన్స్ లో  బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధుల మంజూరులో తన వంతు కృషిని కొనసాగిస్తామన్నారు.ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో కష్టాలలో ఉన్న పేదలను ఆదుకునేందుకు అదేవిధంగా విద్యా, వైద్యం తదితరాల విషయమై తమ ఆధ్వర్యంలోని బిఎల్ఆర్ ట్రస్ట్ నిరంతరం పనిచేస్తుందన్నారు.
 ఈ జన్మదిన వేడుకల్లో  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ లు బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలలో పాల్గొని  కేకులు కట్ చేయించి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
 జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్  శాంతి సాయి జన శేఖర్, కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, పన్నల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గరిక సుధాకర్, ఆకుల మహేందర్, రామ్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, కాటపల్లి రవీందర్ రెడ్డి, జే. ప్రభాకర్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, ఎండి మస్తక్, వేముల సంతోష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్లో అధ్యక్ష కార్యదర్శులు, మహిళలు, పార్టీ శ్రేణులు  కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు నాయకులు చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు ఎంపల్లి పద్మా రెడ్డి, పాత్రికేయ సోదరులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.