టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా దేవునూరి రవీందర్

Published: Tuesday March 07, 2023
శంకరపట్నం మార్చి 06 ప్రజాపాలన రిపోర్టర్:


కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో జర్నలిస్టుగా పనిచేస్తున్న దేవునూరి రవీందర్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శిగా నియమించినట్లు టీ డబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుడుతాడి బాపూరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు జరిగిన టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశము జరిగింది. జిల్లా కమిటీ తీర్మానం మేరకు రవీందర్ ని నియమించినట్లు బాబురావు తెలిపారు. ఈ నియామకం ఈరోజునుండి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. తనను నియమించినందుకు టీ డబ్ల్యూ జేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు బాపూరావుకు రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా పోరాడుతానని ఆయన తెలిపారు.