రక్షిత కౌలు దారులకు తక్షణమే పట్టాలి ఇవ్వాలి కలెక్టర్ కార్యాలయం మెమోరండం అందజేశారు

Published: Wednesday August 24, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి.తాటిపర్తి సింగారం కుర్మిద్ద నంది వనపర్తి  గ్రామాలల్లో తరతరాలుగా  సాగు చేస్తున్న 1400 ఎకరాల భూమిని రక్షిత కౌలుదారులకు  వెంటనే పట్టాలు ఇవ్వాలని  ఈరోజు  కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం ఇవ్వడం జరిగింది   ఈ కార్యక్రమంలో  రైతు సంఘం  జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి  వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్.  వ్య కా స.జిల్లా అధ్యక్షులు పి అంజయ్య  కెవిపిఎస్ జిల్లా నాయకులు  ఆలం పల్లి నర్సింహా, భూసాధన  కమిటీ  కార్యదర్శి  జోగు రాములు, సహాయ కార్య దర్శి రాజిరెడ్డి,  ఉపాధ్యక్షులు సంజీవ  సహాయ కార్యదర్శి మహేష్,   డి రమేష్ , సత్తయ్య,    రవీందర్,  శ్రీరాములు, ప్రశాంత్, ఎట్టయ్య, సత్తమ్మ,  మల్లేష్,  గోపాలు,  తదితరులు ఉన్నారు.