మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం.

Published: Monday November 22, 2021

కొడిమ్యాల, నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండలం లో గల డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం లో ఎల్లే లక్ష్మీ అనారోగ్యం తో మరణించగా ఆ కుటుంబానికి ఏలేటి కమలాకర్ రెడ్డి  7500 రూపాయల తో పాటు గ్రామ ప్రజల సహకారం తో 40000 రూపాయల ఆర్ధిక సహాయం ఆదివారం చేశారు. అలాగే మరొక నిరుపేద కుటుంబానికి చెందిన గాజుల పెద్ద నర్సయ్య(బక్కయ్య) మరణించగా ఆ కుటుంబానికి ఏలేటి కమలాకర్ రెడ్డి 4000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురకంటి ముత్యం రెడ్డి, బి.జే. యై.ఎం జిల్లా నాయకులు గోల్కొండ రాజు, వార్డ్ సభ్యులు బోటుక శ్రీనివాస్, పుండ్ర వెంకట్ రెడ్డి, బైరి సంజీవ్, గాజుల ప్రసాద్ పాల్గొన్నారు