ఆసరా పింఛన్ అర్హులకు మరో అవకాశం కల్పించాలి ఐద్వా మహిళ సంఘం మండల అధ్యక్షురాలు పోతు విజయ శంకర
Published: Wednesday October 26, 2022
జన్నారం, అక్టోబర్ 25, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఆసరా పెన్షన్ పొందేందుకు అర్హులైన వారికి మరో అవకాశం కల్పించాలని మంగళవారం పోతు విజయ శంకర్ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో ఆసరా పింఛన్ పొందే 21 రకాల లబ్ధిదారులు కొందరికి సరైన అవగాహన లేకపోవడంతో ఆసరా పెన్షన్ కు ఎలా చేసుకోవాలో తెలియలేక దరఖాస్తు చేసుకోలేక పోయామన్నారు. ఆసరా పెన్షన్ లో పేర్లు తారుమారు చేయబడినవి అన్నారు. మండలం మండలంలోని ఆసరా పెన్షన్ కోసం అర్హులై ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆమె కోరారు
Share this on your social network: